వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరెక్కువ తిన్నారు?

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు అసెంబ్లీలో చేసుకున్న వాదోపవాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఎవరు ఎక్కువ తిన్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది. దీని మీద ఇతర చిన్న పార్టీల నాయకులు చేసిన ప్రసంగాలు ఇంకా ఆసక్తిని రేపాయి.

చంద్రబాబు నాయుడు హయాంలో ప్రైవేటైజేషన్ ఊపందుకున్నా, దాని ఫలాలు వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తోంది. ఆ బాధ చంద్రబాబు నాయుడు మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదోనన్న కంగారు ఆయనకు ఉంది. చంద్రబాబు నాయుడు 2000 కోట్లు సంపాదించినట్టు 2000 సంవత్సరంలో తెహెల్కా డాట్ కాం ప్రచురించింది. ఇప్పుడు ఈ ఐదేళ్ళలో వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష కోట్లు సంపాదించినట్టు తెలుగుదేశం పార్టీ కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. సెజ్ లు, కార్పొరేట్ సంస్ధలకు ప్రభుత్వం తరఫున ఎన్ని రకాల తాయిలాలు ఇవ్వడం ద్వారా ఆయా సంస్ధలు వైఎస్ కుమారుడు జగన్ వ్యాపార సామ్రాజ్యంలో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధాన విమర్శ. అది చాలా వరకు నిజమే. తిరిగి రావనుకునే ఆ యా సంస్ధలు కోట్లాది రూపాయలు ఇచ్చాయంటే వారు ప్రభుత్వం నుంచి మరో రూపంలో ఎన్నో తాయిలాలు పొంది ఉంటారన్నది నగ్న వ్యాపార సత్యం. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఆ రెండు మీడియా సంస్ధలను దెబ్బతీయడానికి "సాక్షి" ద్వారా ప్రారంభమైన స్కెచ్ ఇప్పుడు వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా స్పీడుగా పనిచేస్తున్నట్టు కన్పిస్తోంది.

చంద్రబాబు నాయుడికి మానసికంగా స్ధైర్యం లేకుండా చేయడానికి వైఎస్ పావులు కదుపుతున్నారు. చంద్రబాబు మానసిక పిరికి అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ నుంచి ఒక చిన్న నాయకుడు వెళ్ళిపోతున్నాడన్నా ఆయనకు భయమే, ఆయనకు ఆందోళనే. మరి కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుని బాబుకు మరింత దడ పుట్టించాలని వైఎస్ వ్యూహం రచించుకున్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం ద్వారా తెలుగుదేశం ఇప్పటికీ చాలా పటిష్ట

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X