Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పులివెందుల పులి వైయస్

YS Rajasekhar Reddy
డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి(60) గారు 1949, జులై 8వ తారీఖున కడప జిల్లాలోని పులివెందుల గ్రామంలో వై.యస్.రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించారు. విధ్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల అమితాశక్తి గల వై.యస్ కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుండీ మెడిసిన్ పట్టా అందుకున్నారు. గుల్బర్గాలోని యమ్.ఆర్.మెడికల్ కళాశాలలో మెడిసిన్ చేసిన ఆయన కళాశాలలోని స్టూడెంట్ యూనియన్ కి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత తిరుపతిలోని యస్.వి.మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ చేసిన ఆయన హౌస్ సర్జన్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జమ్మలమడుగులోని మిషన్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా కొంత కాలం పనిచేసిన ఆయన 1973లో తన తండ్రి వై.యస్.రాజారెడ్డి పేరున పులివెందులలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. 1972 లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వై.యస్.జగన్మోహన రెడ్డి, షర్మిల వీరి సంతానం.

సమాజసేవలో నిమగ్నమైన ఆయన 1978లో రాజకీయరంగ ప్రవేశం చేసారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా, ఆరు సార్ల అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. ఆయన పోటి చేసిన ప్రతి సారీ విజయం సాధించారు. "అపజయాన్నే జయించారని" ఆయన అభిమానులు ఆయన గురించి చెప్తారు. ఇలా అపజయమే ఎరుగని యోధుడు వై.యస్. 1999 నుండీ 2004 వరకూ, 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎపిసిసి) అధ్యక్షుడిగా 1983-1985 మరియు 1998-2000 మధ్య రెండు సార్ల ఎన్నికయ్యారు. ఆయన 1980 - 83లో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, విద్యా శాఖలను నిర్వహించారు.

సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా పేరొందిన ఆయన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనేందుకు 2003వ సంవత్సరంలో మూడు నెలల పాటు 1400 కిలో మీటర్ల పాదయాత్ర చేసారు. దీంతో ప్రజలకు చేరువైన వై.యస్ 2004లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జలయగ్నం పేరుతో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, రైతులకు ఉచిత విద్యుత్ అందించి, ఆరోగ్య శ్రీ వంటి ప్రజాకర్షక పథకాలను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు రుణాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులను చూరగొన్నారు. దీంతో ఆయన 2008లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించి మరో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యా అభివృద్ధి, విశ్ససనీయతే తమను 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి విజయం చేకూర్చి పెట్టిందని రాజశేఖర రెడ్డి పదే పదే చెబుతూ వచ్చారు.

కానీ సెపెంబరు 2వ తారీఖున నాటకీయ పరిణామాల మధ్య అదృశ్యమైన హెలీకాప్టర్ ఉదంతంలో దురదృష్టావశాత్తు దుర్మరణం చెందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+