కెసిఆర్ వర్సెస్ కోదండరామ్

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిలియన్ మార్చ్ తెదీ ఖరారు దగ్గరి నుంచి ఇరువురి మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. మిలియన్ మార్చ్ తేదీని కెసిఆర్ ఏకపక్షంగా ప్రకటించారని అంటున్నారు. దీంతో కోదండరామ్ కలత చెందారని, అయినప్పటికీ పిలుపునిచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం బాగుండదనే ఉద్దేశంతో ముందుకు సాగినట్లు చెబుతున్నారు. కోదండరామ్ నేతృత్వంలోని రాజకీయ జెఎసిని కెసిఆర్ కట్టడి చేయడానికి, తన అదుపులో ఉంచుకోవడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా కోదండరామ్‌ను కెసిఆర్ మనిషిగానే భావిస్తూ వచ్చాయి. రాజకీయ జెఎసిని తెరాస అనుబంధ సంస్థగా వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పరీక్షల సమయం కావడంతో ప్రభుత్వం మిలియన్ మార్చ్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను తెలంగాణ రాజకీయ జెఎసికి వ్యతిరేకంగా మలచి, దానిపై వ్యతిరేకత పెంచడానికి వాడుకుంది. మిలియన్ మార్చ్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిడికి వాయిదా వేసుకునేలా చేయాలని ప్రయత్నించింది. ఈ స్థితిలో కెసిఆర్ మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయించడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు చెబుతారు. మిలియన్ మార్చ్‌ను వాయిదా వేసుకుంటే వెనక్కి తగ్గిన భావన ఏర్పడి, ఉద్యమం దెబ్బ తినే ప్రమాదం ఉందని రాజకీయ జెఎసి గుర్తించింది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా దాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మిలియన్ మార్చ్‌కు తెరాస ఏ మాత్రం సహకరించలేదని, తాము సహకరించకపోతే కార్యక్రమం విఫలమవుతుందని కెసిఆర్ భావించినట్లు చెబుతారు.

మిలియన్ మార్చ్‌కు పెద్ద యెత్తున ప్రజలు కదిలిరావడంతో కెసిఆర్ దిగి వచ్చి హైదరాబాదులోని ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అయితే, ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ఉద్యమాన్ని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించిన కెసిఆర్‌కు ఇదే దెబ్బనని చెప్పాలి. ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో కంగు తిన్న కెసిఆర్ వెనక్కి వెళ్లిపోయారు. కోదండరామ్‌తో విభేదిస్తూ మిలియన్ మార్చ్ విషయంలో అనుసరించిన వ్యతిరేక వైఖరి కెసిఆర్‌ రుచి చూడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి ఆందోళనకారుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాస, సిపిఐ తెలంగాణ ప్రాంత నాయకులు మొక్కుబడిగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని అనిపించుకోవడానికి మాత్రమే పని చేశారు తప్ప మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయడానికి పూనుకోలేదని చెబుతారు. ఈ విషయం మిలియన్ మార్చ్ సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+