టి-కాంగ్రెసులో ద్రోహులు ఎవరు?

ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు పలువురు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోని, ప్రస్తుతం ఉన్న మంత్రుల వైపు అనుమానంగా చూస్తున్నారు. వైఎస్ సిఎంగా ఉండగా కొందరు మంత్రులు తెలంగాణ అంశంపై మాట్లాడేందుకే ముందుకు రాలేదు. మరికొందరు అభివృద్ధి తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని, అభివృద్ధి జరిగాకే ప్రత్యేక రాష్ట్రం కావాలని యువ ప్రజా ప్రతినిధుల ఫోరం పేరిట పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ, వైఎస్ వ్యతిరేకులుగా పేరొందిన కేఆర్ ఆమోస్, కె. యాదవరెడ్డి, బి.కమలాకర్రావు, పాల్వాయి గోవర్దనరెడ్డి తదితర నేతలను అప్పట్లో పక్కకు పెట్టారు. అంతేకాదు ఎదురుదాడికి కూడా దిగేవారు.
వైఎస్ మరణానంతరం రాష్ట్ర రాజకీయాలతోపాటు, ఆ నేతలూ మారిపోయారు. వారంతా తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇప్పుడు హోదాలకు అతీతంగా మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా తెలంగాణ వాదం వినిపిస్తున్నారు. ఏకతాటిపై నిలిచారు. ఇలాంటి సమయంలో మధుయాష్కీ పేల్చిన తూటా గుమ్మడి కాయల దొంగలు భుజాలు తడుముకునేలా చేసింది. ఉద్యమ ద్రోహులు ఎవరన్న చర్చకు దారి తీసింది. అప్పట్లో అధినాయకత్వాన్ని కలిసి తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకున్నా పర్వాలేదంటూ అధిష్ఠానానికి నూరిపోసిన వారెవరన్న చర్చకు తెరలేపింది. ఇది ఇక్కడితో ఆగిపోతే మంచిదని, అధిష్ఠానానికి గతంలో ఎవరెవరు ఏయే నివేదికలు ఇచ్చారోనన్న చర్చలోకి వెళితే అంతర్గత విభేదాలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా మధుయాష్కీ వ్యాఖ్యలను ఖండించక పోవడమే కాకుండా కావచ్చునని కూడా అన్నారు.












Click it and Unblock the Notifications