ఆ రెండే అసలు పరీక్ష: కెసిఆర్కు ముచ్చెమటలు?

అంతేకాదు జూపల్లి కృష్ణారావు రాకతో స్థానిక పార్టీ ముఖ్య నేత ఒకరు జిల్లాలో కాంగ్రెసుకు దగ్గరయ్యారు. ముఖ్యనేత దూరమవడం, ప్రధానంగా తెలంగాణవాదం జాతీయస్థాయిలో గట్టిగా వినిపిస్తున్న బిజెపి బరిలోకి దిగడం తమకు నష్టం కలిగిస్తుందని వారు మదన పడుతున్నారట. ఇక వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్కు టెన్షన్ పెడుతున్న మరో నియోజకవర్గం అని అంటున్నారు. అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజయ్యపై స్థానికంగా చాలా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అదే సమయంలో రాజయ్య కంటే టిడిపి సీనియర్ నేత కడియం శ్రీహరి చాలా బెటర్ అని ప్రజలు భావిస్తున్నారట. రాజయ్య టిఆర్ఎస్లోకి వెళ్లినప్పటికీ స్థానిక కాంగ్రెసు క్యాడర్ పెద్దగా ఆయన వెంట రాలేదని అంటున్నారు. ఇవన్నీ బేరీజు వేసిన రాజకీయ పరిశీలకులు కొద్దిగా కష్టపడితే అక్కడ టిడిపి గెలుస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ సీనియర్లు పలువురు అక్కడే మకాం వేసి రాజయ్య గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయినప్పటికీ అక్కడ గెలుస్తామా? గెలిచినా మెజార్టీ భారీగా వస్తుందా? అని టిఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోందంట. కెసిఆర్ పార్లమెంటు స్థానం అయిన మహబూబ్నగర్, తెలంగాణవాదానికి ఉద్యమ కోట అయిన వరంగల్ జిల్లా నియోజకవర్గమే టిఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించడం విశేషం.












Click it and Unblock the Notifications