ఆంధ్రజ్యోతి సర్వే: ఆ విషయంలో.. ఎన్టీఆర్ కంటే వైఎస్కే ఎక్కువ మార్కులు!
49.92 శాతం మంది ఏపీ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలకు మద్దతు పలకగా.. 46శాతానికి పైగా జనం ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు భేష్ అన్నారట.
విజయవాడ: ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంక్షేమాల పథకాల విషయంలో దివంగత సీఎంలు ఎన్టీఆర్-వైఎస్ మధ్య పోలిక తెచ్చిన సర్వే.. ఎక్కువ మంది జనం వైఎస్ సంక్షేమ పథకాలకే ఓటేశారని స్పష్టం చేసింది.
49.92 శాతం మంది ఏపీ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలకు మద్దతు పలకగా.. 46శాతానికి పైగా జనం ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు భేష్ అన్నారట. కాగా, 20ఏళ్ల క్రితం నాటి ఎన్టీఆర్ పాలన గురించి, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేదన్నది కూడా గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఈ ఇద్దరి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు.. ఎన్టీఆర్-వైఎస్ లను జనాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా చేశాయన్న విషయం సర్వే ద్వారా స్పష్టమైంది.

అప్పట్లో.. రెండు రూపాయల బియ్యం, బలహీన వర్గాలకు గృహాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరైతే.. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాలను జనంలో వైఎస్ను ప్రత్యేకంగా నిలిపాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications