ఎపి బాధ్యతల నుంచి దిగ్విజయ్కి విముక్తి?
దిగ్విజయ్ సింగ్తో పాటు పార్లమెంట్ సభ్యులు కాకుండానే ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మధుసూదన్ మిస్త్రీ(గుజరాత్), షకీల్ అహ్మద్(బీహార్), మోహన్ ప్రకాశ్(రాజస్థాన్)లను కూడా లోక్సభకు పోటీ చేయించే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు, రాహుల్ జట్టులో చేరేందుకు ఉత్సుకత ప్రదర్శనిస్తున్నారని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు మంత్రి పదవిని వదులుకున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్, రక్షణశాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్లకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జైరాం రమేష్ను ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన పాత్రను జైరాం రమేష్కు అప్పగించడానికి సన్నాహాలు పూర్తయినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు పార్టీకి సేవ చేసేందుకు సిద్ధపడుతుండగా, లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇప్పటికే తమ తమ లోక్సభ నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలను మెరుగుపర్చుకునే కార్యకమాల్లో నిమగ్నమయ్యారు.