నాకెందుకు?: రుణమాఫీ తిరస్కరించిన 'ఆదర్శ' రైతు
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని దొండపాడుకు చెందిన సురేష్ అనే మధ్య తరగతి రైతు రుణమాఫీని తిరస్కరించారు. తనకు ఉన్న 9 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఊరిలోని తలాపా కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్ట్మాస్టర్గా పని చేస్తున్నాడు.
ఎన్నికల సందర్భంగా రైతులకిచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసింది. ఇందులో సురేస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.40 వేల రుణం కూడా మాఫీ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న సురేష్ బ్యాంకుకు వెళ్లి, తాను తీసుకున్న రుణంతో పాటు దానికి అయిన వడ్డీని చెల్లించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... తనకు రుణమాఫీ అవసరం లేదని చెప్పారు.
రుణమాఫీ అవసరం ఉన్నంత ధీన స్థితిలో తాను లేనని వివరించారు. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో ఎవరికి వారు తమ చిత్తశుద్ధిని ప్రశ్నించుకోవాలని సూచించారు. ఈ విషయమై ఆయన లేఖ విడుదల చేశారు.
ధనవంతులు కూడా సత్యం, ధర్మం, న్యాయం గురించి ఆలోచించకుండా రాజకీయ మెతుకులకు ఎగబడి కష్టం లేకుండా వచ్చే డబ్బు కూడబెట్టుకుంటున్నారని, అది సరికాదని అభిప్రాయపడ్డారు. తాను అందుకే రుణమాఫీ తిరస్కరించానని చెప్పారు.