ఎవరైనా ఊరుకోవద్దు: బాలకృష్ణకు కోపం వచ్చిందట!
అనంతపురం: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్మెంట్ వ్యవహారాలను ఆయన సీరియస్గా తీసుకున్నారని చెబుతున్నారు. భూకబ్జాల విషయం తెలిసిన బాలకృష్ణ ఈ విషయమై సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు.
కొంతమంది కలిసి విలువైన భూములను కబ్జా చేస్తున్నారని, సెటిల్మెంట్ చేస్తున్నారని ఆయన దృష్టికి వచ్చిందని, దీనిపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఇలాంటి వాటికి తావు ఇవ్వవద్దనే కృతనిశ్చయంతో బాలకృష్ణ ఉన్నారంటున్నారు.

పార్టీకి చెందిన వారు కూడా పలువురు ఇలా చేస్తున్నారనే ఆరోపణలను ఆయన సీరియస్గా తీసుకున్నారని, తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా బాలకృష్ణ వివరాలు సేకరించారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎవరు అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ అధికారులను ఆదేశించారని చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications