'వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేది'
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తాను ఎంపీగా ఉన్నప్పుడే నయీం పని క్లోజ్ అయ్యేదని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గ్యాంగ్ స్టర్ నయీం డైరీలో ఉన్న పేర్లన్నింటినీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
నయీం తనను ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బెదిరించాడని చెప్పారు. తనను పోటీ నుంచి తప్పుకోమని చెప్పారన్నారు. వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేదని, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఉద్యమం కారణంగా దృష్టి సారించలేదన్నారు.

తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి నాడు తెలంగాణ కోసమే పదవికి రాజీనామా చేశారని చెప్పారు. నయీం డైరీలో పేర్లన్నింటిని బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ అధికారి పైన నమ్మకం ఉన్నా, విచారణ పైన నమ్మకం లేదన్నారు. నయీంతో 90 శాతం మంది రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్నారు.
ముఖ్యమంత్రికి క్రెడిబిలిటీ లేదన్నారు. ఉంటే నయీం కేసులో తెరాస నాయకులే జైలుకు వెళ్లాలన్నారు. కేసీఆర్ అరెస్టు చేయాలనుకుంటే ఐదు నిమిషాల్లో చేయవచ్చునని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేస్తారని అనుకోవడం లేదన్నారు.
నయీం కేసులో ఆధారాలు: అమ్మాయిలతో జల్సాలు చేస్తూ..తమకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే ప్రభుత్వానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలబెడతామని చెప్పారు. తెలంగాణ మొత్తం మీద కోమటిరెడ్డి సోదరులకు ంచి పేరు ఉందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వెళ్లినా తాము సహకరిస్తామని చెప్పారు.
తాము రాజకీయాల్లోకి వచ్చాక డబ్బులు సంపాదించుకోలేదని, వ్యాపారం నుంచి వచ్చామని, రాజకీయాల్లోకి వచ్చాకనే తాము ఖర్చు పెట్టామన్నారు. కార్యకర్తలను, పేదలను ఆదుకోవడ-ం కోసం ఖర్చు పెడుతున్నామన్నారు. తాము బతికినన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications