కెసిఆర్ చెంత కంటతడి పెట్టిన రసమయి
హైదరాబాద్: "తెలంగాణ వచ్చినంక కళాకారుల గొంతు ఆగింది.. పనులు లేవు.. పాటలు లేదు.. అడ్డా కూలిపనికి పోతున్న స్థితి. ఈ సమయంలో కేసీఆర్ మీకు నేనున్నా అంటూ ఈ బక్కచిక్కిన జీవితాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీరేది కాదు" అంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మెన్ రసమయి బాలకిషన్ సభా వేదికపై కంటతడి పెట్టారు. కళాకారుల తరుపున సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ఆదివారం కళాకారుల సమ్మేళన సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
"ఒక మారుమూల గ్రామంలో జీతగాని బిడ్డనైన తనను ఇంతవాడిని చేసిన గురువు.. ఉద్యమ నేత..కేసీఆర్ మాత్రమే. నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే, పునర్జన్మనిచ్చింది మాత్రం కేసీఆర్" అని బాలకిషన్ అన్నారు.
ఉద్యమం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన భుజం తట్టి ఓదార్చారు. 550 మంది తెలంగాణ కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసి కేసీఆర్ తమ కుటుంబాలను ఆదుకున్నారని బాల్కిషన్ అన్నారు. విప్లవం అంటే ఎక్కడో లేదు.. కేసీఆర్ వద్దనే ఉందని అన్నారు. ఇవాళ కళాకారులు గంటల తరబడి పాటలు పాడుతున్నారంటే ఆ శక్తి అంతా కేసీఆర్ ఇచ్చిందేనని అన్నారు.. మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలను ప్రజలముందుకు తీసుకెళుతామని ప్రతిజ్ఞ చేశారు.

కెసిఆర్ సహపంక్తి భోజనం
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులతో సహపంక్తి భోజనం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులతో గడిపిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. వివిధ రకాల తెలంగాణ వంటకాల రుచి చూపించిన సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ను ప్రశంసించారు.
తొలుత కళాకారులు ఆర్ట్గ్యాలరీలో సీఎం రాకకోసం నిరీక్షించి ఆయన వచ్చాకే భోజనాలకు ఉపక్రమించారు. ఇంట్లో మన భోజనం చేసినట్లుగా ఉందని అన్న కేసీఆర్ ఉద్యమసమయంలో పాటలు పాడిన కళాకారులను పేరుపేరునా పిలిచి బాగున్నావా.. అంటూ పలకరించారు. తమను పేర్లతో సహా గుర్తుపెట్టుకుని పలకరించడం విశేషం.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications