Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయ మృతి చెంది నెల రోజులు అయ్యింది: అందరూ ఇలా

జయలలిత చనిపోయి నెల రోజులు పూర్తి అయిన సందర్బంగా తమిళనాడు ప్రజలు అమ్మ ఫోటోలతో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా, తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన జయలలిత మరణించి నేటికి నెల రోజులు అయ్యింది. అమ్మ చనిపోయి నెల రోజులు పూర్తి అయిన సందర్బంగా తమిళనాడు ప్రజలు అమ్మ ఫోటోలతో ర్యాలీలు నిర్వహించారు.

అన్నాడీఎంకే కార్యకర్తల ఆధ్వర్యంలో తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. జయలలిత ఫోటోలు పెట్టుకుని, నల్లబ్యాడ్జీలు వేసుకుని ర్యాలీలు నిర్వహించారు.

AIADMK cadres hold peace rallies all over the state as they observed the 30th day of the demise of former CM Jayalalithaa.

అనేక ప్రాంతాల్లో జయలలిత పేరు మీద ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించారు. జయలలిత ఆశయాలు నేరవేర్చుతామని అన్నాడీఎంకే నాయకులు ప్రతిజ్ఞ చేశారు. పలు చోట్ల అమ్మ అభిమానులు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశారు.

చెన్నైలోని మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అమ్మకు నివాళులు అర్పించారు. జయలలిత మరణించి నెల రోజులు అయినా ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+