సంచలన తీర్పు: రేప్ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రెచ్చిన బాబా అనుచరులు
సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల రేప్ కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా తేల్చింది.
పంచకుల: సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల రేప్ కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా తేల్చింది. 2002లో ఇద్దరు మహిళలను రేప్ చేశాడని గుర్మీత్ పై కేసు నమోదైంది.
కాగా, ఆగస్టు 28న గుర్మీత్ బాబాకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే, ఆయన మద్దతుదారులు లక్షల సంఖ్యలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చారు. ఆయుధాలు, పెట్రోలు, డీజీల్ బాటిళ్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో రెండు(పంజాబ్, హర్యానా) రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు గుర్మీత్ బాబా మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.
గుర్మీత్ బాబాను అంబాలా జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గుర్మీత్ బాబాకు ప్రపంచ వ్యాప్తంగా 6కోట్ల మంది భక్తులుండటం గమనార్హం. విదేశాల్లోని భక్తుల నుంచి భారీగా ఇతనికి విరాళాలు అందుతున్నట్లు తెలిసింది.
రెచ్చిపోయిన బాబా అనుచరులు: ఉద్రిక్తత
కాగా, కోర్టు తీర్పు అనంతరం డేరాబాబా అనుచరులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగి రెచ్చిపోయారు. దీంతో పంచకుల కోర్టు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాబా అనుచరులను టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మీడియా వాహనాలపైనా డేరాబాబా అనుచరులు దాడి చేశారు. దీంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. బాబా ఆశ్రమం దగ్గర రెండు మీడియా వాహనాలకు నిప్పంటించారు. దీంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications