షాక్: ఆయుధ ప్రదర్శన చేసిన ఉత్తరకొరియా, కారణమిదే!
అవసరమైతే అమెరికా యుద్ద నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయధాలను మంగళవారం నాడు ప్రదర్శించింది.
ప్యాంగ్ యాంగ్: అవసరమైతే అమెరికా యుద్ద నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయధాలను మంగళవారం నాడు ప్రదర్శించింది.
తమ సైన్యం ఏర్పాటై 85 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వార్తాసంస్థ యోన్ హస్ తెలిపింది.
తూర్పు తీరంలోని వోన్సాన్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆయుధ ప్రదర్శన నిర్వహించినట్టు దక్షిణకొరియా ప్రభుత్వవర్గాలను ఉటంకిస్తూ యోన్ హాస్ తెలిపింది.

అంతకుముందు కూడ దేశ ఆవిర్భావదినాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రదర్శించింది. అప్పట్లో జలాంతర్గామల నుండి ప్రయోగించగలిగే ఖండాంతర క్షిపణులను కూడ ప్రదర్శించారు.
అవకాశం దక్కినప్పుడల్లా తమ వద్ద ఉన్న భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్యాయో చూసుకోవాలంటూ ప్రపంచ చేశాలకు ప్రదర్శించి చూపించడం ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు అలవాటు. అందులో భాగంగానే ఇప్పుడూ కూడ ఆయుధాలను ప్రదర్శించారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications