మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తరకొరియా! అమెరికా యుద్ధనౌకలే లక్ష్యమా?
ఉత్తరకొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అయితే ఈసారి భూమిపై నుంచి నౌకలపైకి దాడి చేసేందుకు ఉపయోగించే క్షిపణులను పరీక్షించింది. అమెరికా యుద్ధనౌకలే దాని తదుపరి టార్గెట్ గా తెలుస్తోంది.
సియోల్: ఉత్తరకొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అయితే ఈసారి స్వల్ప శ్రేణి నౌక విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకొరియాలోని తూర్పు తీరంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి.
గురువారం ఉదయం ఉత్తరకొరియా తూర్పతీరం నుంచి కొన్ని గుర్తుతెలియని ఆయుధాలను పరీక్షించారని, బహుశా ఇవి భూమిపై నుంచి నౌకలపైకి దాడి చేసేందుకు ఉపయోగించే క్షిపణులు కావచ్చని దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.

ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు అమెరికా ఇప్పటికే థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాకు చేర్చింది. అంతేకాకుండా, కార్ల్ విన్సన్, రొనాల్డ్ రీగన్ యుద్ధనౌకలను కూడా ఉత్తరకొరియా సమీప సముద్ర జలాల్లోకి పంపి లంగరేయించింది.
కానీ అమెరికా చర్యకు ఉత్తరకొరియా ఏమాత్రం బెదరలేదు. ఇప్పుడు తాజాగా ఆ దేశం నిర్వహించిన క్షిపణి పరీక్షలు చూస్తుంటే.. అమెరికా యుద్ధనౌకలే దాని తదుపరి టార్గెట్ గా తెలుస్తోంది.
గురువారం ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు ఆ దేశానికి సుమారు 120 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాయి. ఉత్తరకొరియా ఇటువంటివి మొత్తం 4 క్షిపణులను పరీక్షించింది. ఐక్యరాజ్యసమితి తనపై ఆంక్షలను తీవ్రం చేసిన వారానికే ఉత్తరకొరియా ఈ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా మరిన్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో నిఘా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తామే పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
-
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications