బడ్జేట్ లో ఆపరేషన్ గ్రీన్ కు ప్రాధాన్యత: పచ్చ బంగారం మిషన్ కు రూ. వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2018-19లో వ్యవసాయ రంగానికి, రైతులు, గ్రామీణ ప్రజలు, ఆపరేష్ గ్రీన్ కు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా పచ్చ బంగారం అని పిలుచుకునే వెదురు మిషన్ అభివృద్దికి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018-19లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
పచ్చ బంగారం అని గ్రామీణులు పిలుచుకుని వెదురు మిషన్ అభివృద్దికి కోసం కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018-19లో రూ. 1,200 కోట్లు కేటాయించారు. పశువులకు ఆహారం సేకరించడానికి, మత్స్యకారుల అవసరాల కోసం రూ. 10, 000 కోట్లు కేటాయించారు.

Recommended Video

ఆపరేషన్ గ్రీన్ పథకానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రూ. 500 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మార్కెట్ ల అభివృద్దికి కోసం రూ. 2, 000 కోట్లు కేటాయించారు. 470 ఏపీఎంసీ మార్కెట్లు అనుసంధానం చెయ్యడానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఆకర్షించడానికి ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications