తెలంగాణ: చిరంజీవి స్పష్టత

తెలంగాణపై ప్రజారాజ్యం వ్యవస్థాపక నేత చిరంజీవి మరింత స్పష్టంగా ముందుకు వస్తారా. రావాల్సిన అవసరం ఏర్పడినట్లే ఉంది. తెలంగాణపై స్పష్టత లేకపోతే తదుపరి సమావేశంలో చిరంజీవి వివరణ ఇస్తారని ఆయన రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా చెప్పారు. ఇప్పటికే తెలంగాణ విషయంలో చిరంజీవి చాలా ముందుకు నడిచి వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అంశానికి తన తిరుపతి ప్రసంగంలో చిరంజీవి పెద్ద ఉపోద్ఘాతమే ఇచ్చారు. నీళ్లు, నియామకాలు, నిధుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదనే భావన ఉన్నదని ఆయన గుర్తిస్తూ విడిపోవడమే ప్రజాభీష్టం అయితే అందుకు సహకరిస్తానని ప్రకటించారు. ఒక రకంగా ఈ ప్రకటన స్పష్టంగానే ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తిస్తున్నామని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుదామని కూడా ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది అని కూడా ఆయన గుర్తించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ విషయంలో ముందడుగు వేసినట్లే. అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నిజమే, మరింత స్పష్టత అవసరం. ఇప్పటికే అస్పష్ట వైఖరులతో తెలంగాణ ప్రజలు వేసారి పోతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకున్న అస్పష్ట వైఖరి ఎంత ద్రోహపూరిత చర్యకు దారి తీసిందో తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. అలాగే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని అంటున్నారు గానీ అనుకూలమని మాత్రం చెప్పడం లేదు. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అంటూ వస్తున్నారు. తెలంగాణపై వేసిన కోర్ కమిటీ సమావేశం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని అంటున్నారు. అది కూడా ఎంత వరకు సాధ్యమవుతుందో చెప్పలేం.

చిరంజీవి తెలంగాణపై గోడ మీది పిల్లి వాటంలా వ్యవహరిస్తే లాభం లేదు. కచ్చితమైన నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయన మరింత స్పష్టంగా ముందుకు అవకాశాలున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆచితూసి ప్రతిస్పందించడం ఆ విషయాన్ని సంకేతిస్తున్నాయి. చిరంజీవి తెలంగాణ ప్రకటనపై కెసిఆర్ ఆచితూచి ప్రతిస్పందించారు. చిరంజీవి తనది తుది నిర్ణయం కాదన్నారని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా రానున్న చిరంజీవిని తమ వ్యాఖ్యల ద్వారా దూరం చేసుకోవడం ఎందుకనే అభిప్రాయం చంద్రశేఖరరావుకు ఉండి ఉంటుంది. కెసిఆర్ అప్పట్లో ఢిల్లీలో బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను, బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ జవేదకర్ ను కలవడం కూడా ఇందులో భాగమే కావచ్చు. బహుశా, తెలంగాణవాదులందరినీ ఎన్నికల నాటికి ఒక తాటి మీదికి తేవడమే కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలను కూడా కలుపుకుని వచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఒక ప్రచారం సాగుతున్నది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు గానీ అవకాశం మాత్రం లేకపోలేదు.

తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అందుకే తెలుగుదేశంలో తెలంగాణవాదుల లొల్లి సద్దుమణిగినట్లు అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంలోని తెలంగాణేతర నాయకులు కూడా దీన్ని అంగీకరించినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. వామపక్షాల్లో ఒక సిపిఎంతోనే పేచీ ఉంది. కాంగ్రెసును ఓడించే ప్రయత్నంలో సిపిఎం ప్రధాన పాత్ర పోషించాలని అనుకుంటున్నది. అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చి ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నది. ఇప్పటికే సిపిఎం, సిపిఐలతో కలిసి తెరాస ఆందోళనలు చేస్తున్నది. శాసనసభలో తెలుగుదేశం, తెరాస ఏకతాటిపై నడుస్తున్నాయి. శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసును ఈ రెండు పార్టీలు కలిసి శాసనసభ సచివాయల కార్యదర్శి తుల్జానంద సింగ్ కు అందజేశాయి.

మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది. చిరంజీవి దానికి పాదులు వేసినట్లు గుర్తించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+