ముదురుతున్న గొడవ: ఎసిబి డైరెక్టర్ లీవ్

శ్రీనివాసరెడ్డిని రాత్రికి రాత్రి బదిలీ చేయడాన్ని మొదట్లోనే ఎసిబి డైరెక్టర్ జనరల్ భూపతి బాబు వ్యతిరేకించలేదు. ఆయనను రిలీవ్ చేయడానికి నిరాకరించారు. దాంతో ఆయనను ప్రభుత్వం బలవంతంగా రిలీవ్ చేసింది. తన అభ్యంతరాలను లెక్క చేయకుండా శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేయడాన్ని నిరసిస్తూ భూపతిబాబు దీర్షకాలిక సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం వార్తలు వచ్చాయి.
మద్యం సిండికేట్లకు సంబంధించిన కేసు దర్యాప్తు కీలకదశలో ఉన్న సమయంలో సిట్ చీఫ్ను బదిలీ చేయడం తగదని, ఈనెల 16న హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో కనీసం అప్పటివరకైనా ఆయనను కొనసాగించాలని కోరుతూ భూబతిబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. భూపతి బాబు లేఖను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని రంగంలోకి దించింది. అంతకుముందు డిజిపి దినేశ్రెడ్డి చెప్పినా భూపతి బాబు మెత్తబడలేదు. దీంతో ఆయనను ద్వివేది తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.
శ్రీనివాస రెడ్డి స్థానంలో శివధర్రెడ్డి జాయిన్ అయ్యారని, అయినా మీరు శ్రీనివాసరెడ్డిని రిలీవ్ చేయలేదని, రూల్ పొజిషన్ ఏమిటో చెప్పాలని ద్వివేది భూపతి బాబును ప్రశ్నించారు. భూపతిరాజు చెప్పిన వివరణను ద్వివేది పట్టించుకోకుండా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. తక్షణమే శ్రీనివాస రెడ్డిని రిలీవ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. శ్రీనివాస రెడ్డి పనితీరును తప్పు పట్టి బదిలీ చేయడం లేదని, ప్రమోషన్ మీద బదిలీ చేసిందని ద్వివేది చెప్పినట్లు సమాచారం. రూల్ పొజిషన్ను అనుసరించకుండా లేఖ రాయడం దేనికి సంకేతమని ఆయన అడిగారని అంటున్నారు. ఇలాంటి స్థితిలో తాను పనిచేయలేనంటూ భూపతిబాబు దీర్షకాలిక సెలవు పెట్టినట్లు తెలుస్తోంది.
తాను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు వచ్చిన వార్తలను భూపతిబాబు ఖండించారు. ఆయన శనివారం విధులకు హాజరయ్యారు.
నాపై ఒత్తిడి లేదు: సిఎం
శ్రీనివాసరెడ్డి బదిలీ విషయంలో తనపై ఏ ఒత్తిడీ లేదని తనను కలిసిన అఖిలపక్ష నేతలకు ముఖ్యమంత్రికిరణ్కుమార్రెడ్డి చెప్పారు. ఆయన బదిలీ సాధారణ పరిపాలనలో భాగంగానే జరిగిందని చెప్పారు. మద్యం సిండికేట్ల విషయంలో మంత్రుల ప్రమేయంపై రుజువులు లభిస్తున్న క్రమంలో దర్యాప్తును నీరుకార్చొద్దని, శ్రీనివాసరెడ్డి బదిలీని నిలుపుదల చేయాలని అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రిని కోరారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో వస్తున్న అధికారి కూడా నిజాయితీపరుడేనని, దర్యాప్తు యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. శ్రీనివాసరెడ్డిని పదోన్నతిపైనే బదిలీ చేశామని, శ్రీనివాస రెడ్డిని ఇప్పుడున్న స్థానంలో కొనసాగించడం వీలుపడదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
రాజకీయ కుట్ర లేదు: శ్రీనివాసరెడ్డి
ప్రభుత్వ అధికారులకు బదిలీలు సర్వసాధారణమేనని ఎసిబి నుంచి రిలీవ్ అయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేశానని ఆయన మీడియాతో అన్నారు. మద్యం కేసులకు సంబంధించి ఒక నివేదిక పూర్తి అయ్యిందని, మరో నివేదికను రూపొందిస్తున్నామన్నారు. 16వ తేదీలోగా హైకోర్టుకు అందజేస్తామన్నారు. ఇది క్లిష్టమైన కేసు కాబట్టి సాధారణ కేసుల్లా భావిస్తూ వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరించలేమన్నారు.
సిట్లో ఇతర అధికారులకు ఈ కేసు గురించి వివరించాలని, అందుకే రిలీవ్ అవడానికి ఆలస్యం అయ్యిందని చెప్పారు. తన బదిలీ వెనుక రాజకీయ కుట్ర ఉందని తాను భావించట్లేదన్నారు. ఈ ఆరోపణలపై తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications