రైలు ప్రమాదం:మృత్యు ఒడిలోకి టెక్కీ దంపతులు

సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రమణకు, పల్లవికి ఐదు నెలల క్రితమే వివాహమైంది. కంప్యూటర్ అప్లికేషన్స్లో వారిద్దరు మాస్టర్స్ డిగ్రీ చేసారు. రమణ చెన్నైలోని ఫోర్డ్లో పనిచేస్తుండగా, పల్లవి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఐదు నెలలుగా పల్లవి నందిగామలో తన కుటుంబ సభ్యులతో ఉంటోంది. అషాఢ మాసం ముగియడంతో పల్లవిని తీసుకుని వెళ్లాలని కుటుంబ సభ్యులు రమణకు చెప్పారు.
రెండు రోజుల క్రితమే రమణ ఇంటికి వచ్చాడు. రమణ, అతని భార్య, అత్త తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ -11 బోగీలోని 49, 50, 51 సీట్లు వారికి రిజర్వయ్యాయి. రమణ పై బెర్త్ మీద పడుకున్నట్లు తెలుస్తోంది. అనిమల్లపాడులో శనివారం వీడ్కోలు తీసుకున్న నూతన దంపతులు ఆదివారం విజయవాడకు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించారు.
రమణ కుటుంబ సభ్యులు విషాద సంఘటనకు బోరుమంటున్నారు. చిన్నపాటి రైతు అయిన రమణ తండ్రి యల్లమందుకు నలుగురు పిల్లలు. రమణ చిన్నవాడు. మిగతా వారంతా గ్రామంలోనే వ్యవసాయం చేసుకంటున్నారు. రమణ ఒక్కడే పైచదువులు చదివి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications