క్వార్టర్స్లోకి భారత్: ధోనీకి గేల్ కంగ్రాట్స్(పిక్చర్స్)
పెర్త్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 182 పరుగులకు అలౌటైంది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్ను కూడా వెస్టిండీస్ బౌలర్లలో త్వర త్వరగానే పెవిలియన్ పంపారు. అయితే ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
కాగా, ఇది ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాకు నాలుగో వరుస విజయం కావడం గమనార్హం. మార్చి 10న టీమిండియా ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.

షమీ మెరుపులు
భారత పేసర్లు మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్లు వెస్టిండీస్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చడంలో సఫలమయ్యారు. వికెట్లు తీసిన ఆనందంలో షమీ, రైనా.

భారీ మద్దతు
వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచుకు అత్యధిక సంఖ్యలో హాజరైన భారతీయులు టీమిండియాకు మద్దతు పలుకుతూ నినాదాలు చేశారు.

వికెట్ తీసిన ఆనందం
వెస్టిండీస్ బ్యాట్స్మెన్ వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు.

శామ్యూల్స్ రనౌట్
శామ్యూల్స్ను మోహిత్ శర్మ రనౌట్ చేయడంతో ఆనందంతో వ్యక్తం చేస్తున్న విరాట్ కోహ్లీ, యాదవ్.

శిఖర్ పెవిలియన్ బాట
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శుక్రవారం జరిగిన మ్యాచులో కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు.

రహానే షాట్
బంతిని బౌండరీకి తరలిస్తున్న అజింక్యా రహానే. ఈ మ్యాచులో రహానే 14 పరుగులు చేశాడు.

రైనా నిరాశ
22 పరుగులు చేసిన అనంతరం ఔటవడంతో నిరాశతో పెవిలియన్ చేరుకుంటున్న రైనా.

కెప్టెన్ కూల్
వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచులో టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చిన కెప్టెన్ ధోనీ. 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అశ్విన్, ధోనీ
51 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాను గెలిపించిన ధోనీ, అశ్విన్.

ధోనీకి గేల్ కంగ్రాట్స్
టీమిండియాను గెలిపించిన కెప్టెన్ ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతున్న విండీస్ స్టార్ బ్యాట్స్మెన్ గేల్.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..!












Click it and Unblock the Notifications