బాలయ్యకు సైకిల్ సారథ్యం?

బాలకృష్ణ సెప్టెంబర్ 19వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఏ మేరకు నిజమనేది ఇప్పుడే చెప్పలేం. అయితే ముఖ్యమంత్రి పదవిని మాత్రం చంద్రబాబుకే కట్టబెట్టాలని నిర్ణయం జరిగిందట. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. తారకరత్న మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీపై గానీ, రాజకీయాలపై గానీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని ఆయన గతంలో ఒక్కసారి అన్నారు.
చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కొంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని నివారించడమే కాకుండా సినీ గ్లామర్ తో చిరంజీవిని ఎదుర్కోవాలనే పట్టుదలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని, అందుకే బాలకృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
