గ్రేటర్ ఫైట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆయన గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెసుపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెసుకు పోటీ తాము మాత్రమే ఇవ్వగలమని ఆయన చెబుతూ లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలకు ఓటేయవద్దని ఆయన ప్రజలకు నూరిపోసే యత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీలు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యాయని ఆయన చెబుతున్నారు. తద్వారా కాంగ్రెసు వ్యతిరేక వోటు ఏకమొత్తంగా తాను రాబట్టుకునే యత్నం చేస్తున్నారు. అదే సమయంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల హైదరాబాదు ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా మారుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
గ్రేటర్ హైదారబాద్ ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం వామపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి మధ్య సయోధ్య కుదుర్చుడానికి ఆ సిపిఐ, సిపిఎం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ప్రజారాజ్యం గానీ, తెలుగుదేశం గానీ సయోధ్యకు అంగీకరించలేదు. ప్రజారాజ్యం లోకసత్తాల మధ్య స్నేహం కోసం జరిగిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో తెలుగుదేశం, లోకసత్తా, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి విడివిడిగా హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉంది. సిపిఐ, సిపిఎంలు తెలుగదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇంత వరకు విభేదాలతో పరస్పర విమర్శలు చేసుకున్న సిపిఐ, సిపిఎంలు ఇటీవలే చేతులు కలిపాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలిసే పని చేయడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications