తెరకు చిరు దూరమే

రాజకీయాల్లో ఆయన వెలుగు వెలగకపోయినా తనకంటూ ఒక ప్రాధాన్యం లభిస్తుండడం పట్ల ఫరవాలేదని అనుకుంటున్నారట. పైగా, ఇప్పుడు బావ మరిదిని రాజ్యసభకు పంపాలని బాధ్యత కూడా ఆయనపై పడింది. ఇందుకు ఆయన కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు రాయలసీమకు చెందిన సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
రామచంద్రయ్యను నిలబెడితే రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కావడమే కాకుండా ఆయన వల్ల పెద్గగా ఇబ్బందులు ఉండవనేది కాంగ్రెసు నాయకులు ఆలోచనగా చెబుతున్నారు. అల్లు అరవింద్ ను రాజ్యసభకు పంపితే తర్వాత మంత్రి పదవి కూడా అడిగే అవకాశం ఉందని, ఆయన డిమాండ్లు చాంతాడులా సాగుతూనే ఉంటాయని కాంగ్రెసు నాయకులు భయపడుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications