నెహ్రూ మాటలు నిజమవుతాయి

అప్పటికే హైదరాబాద్ నగరం దేశంలోనే అతి గొప్ప నగరాలలో 5వ గొప్ప నగరంగా విరాజిల్లుతున్నది. కన్నుకుట్టిన ఆంగ్ల మానస పుత్రులైన ఆంధ్రపాలకులు కుతంత్రంతో, తెలంగాణా ప్రాంతపు నాయకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని 1956లో తెలంగాణాను ఆంధ్రదేశంలో కలుపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం మూన్నాళ్ళ ముచ్చటైంది. కానీ, అలుపెరగని తెలంగాణా వీరులు ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం ఆరంభించినారు. 1969 లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అప్పటినుండి ఉద్యమం రగులుతూనే ఉన్నది. ఇన్నేళ్ళకు మన ఆశలు తీరే సమయం ఆసన్నమైంది. తెలంగాణా కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరవీరుల ఆశలు సాకారం కానున్నాయి. 'ఇష్టం లేకపోతే తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోవచ్చునని' 1964లో నిజామాబాద్ సభలో ప్రకటించిన జవహర్ లాల్ నెహ్రూ మాటలు నిజం కానున్నాయి.












Click it and Unblock the Notifications