గాలిపై అమ్మవారు కన్నెర్ర జేసిందా?

ఐదేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబరులో సుంకులమ్మ దేవాలయాన్ని గాలి పేల్చి వేశారు. ఆ తర్వాత సంవత్సరమే గాలి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు, గాలి సోదరుడి పైన ఆ గ్రామస్థులు పెద్ద గొడవకు దిగారు. రెండేళ్ల తర్వాత అంటే 2008లో గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇంట్లోకి అమ్మవారు వచ్చి హెచ్చరించినట్లుగా వాదనలు ఉన్నాయి. గాలికి నిత్యం అండగా ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్న నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సాధారణ ఎన్నికల అనంతరం సెప్టెంబర్లో నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంతో మృతి చెందారు. 2010లో గాలి ఇంటి ఆరాధ్య దైవం మల్లేశ్వరస్వామి ఆలయ ధ్వజస్థంభం విరిగిపోయింది. ఆ తర్వాత 2011లో గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి అరెస్టయ్యారు. గాలికి ఆపదలన్నీ సెప్టెంబరులోనే రావడం వెనుక సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చిన పాపమే అని స్థానిక భక్తులలో బలంగా ఉందట.












Click it and Unblock the Notifications