గాలికి కిరణ్ కుమార్ రెడ్డి షాక్

2007 మార్చి 26న అట్టహాసంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గాలి జనార్దన్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యాంబాబులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ మూడేళ్లలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే పొడగింపునకు ఇప్పుడు అవకాశం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల కిత్రమే పరిశ్రమల శాఖ బ్రహ్మణీ ఇండస్ట్రీస్ నుంచి ప్రాజెక్టు ప్రగతిపై నివేదిక కోరింది. ఈ నివేదికలో కంపెనీ 10760 ఎకరాల భూమి లెవలింగ్ పనులతోపాటు కాంపౌండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టుపై 1350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.
కొంత మేర బ్లాస్ట్ ఫర్నేస్ మెషీనరీ ప్రాజెక్టులో వెచ్చించామని, మరికొంత మొత్తంతో మెషినరీకి ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ కోసం సర్కారు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో అంబవరం వద్ద 10760 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు విషయంలో కంపెనీ కనీస ప్రగతి కూడా చూపించలేకపోయినందున భూ కేటాయింపులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసు జారీ చేస్తున్నారు.
ఈ సంస్థకు ప్రభుత్వం ఎకరా 18 వేల రూపాయల లెక్కన కేటాయించింది. బ్రహ్మణీ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లకుండా భూమి వెనక్కి ఇవ్వటానికి అంగీకరిస్తే ప్రభుత్వం ఈ భూమి ధరకు సంబంధించి కంపెనీ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన 10760 ఎకరాలను తనఖా పెట్టి బ్రహ్మణీ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి రూ.350 కోట్ల రుణం పొందింది. ఇప్పుడు ఈ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటే ఈ రుణాన్ని ఎవరు చెల్లించాలన్నది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తనకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కావచ్చు, తాను వ్యాపారాల నుంచి తప్పుకుంటానని జనార్దన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications