జగన్ ఆస్తుల జప్తు దిశగా అడుగులు?
కాగా మారిషస్ కేంద్రంగా జగన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు సాగించినట్లుగా దర్యాఫ్తులో వెల్లడైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్తో సంబంధమున్న పదహారు కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఆరా తీసేందుకు రెండు బృందాలను కేంద్రం మారిషస్ పంపాలని నిర్ణయించుకుంది. అయితే రెండు బృందాలను ఒకేసారి పంపాలా? వేరు వేరుగా పంపాలా? ఒక్కో బృందంలో ఎంతమందిని పంపాలి? అనే విషయంపై కసరత్తు జరుగుతోందని సమాచారం. మారిషస్ కేంద్రం సాగిన లావాదేవీల వివరాలు అందజేయాలని, వాటిని అధ్యయనం చేసేందుకు రానున్న బృందానికి సహకారమందించాలని ఇప్పటికే కేంద్రం అక్కడి అధికారులకు లేఖ కూడా రాసింది. నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో అధికారుల బృందాన్ని పంపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జగన్, గాలి ఆర్థిక అనుబంధం గురించి మూడున్నరేళ్ల క్రితమే నిఘావర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయట. కేంద్రానికి నివేదిక కూడా అందించినట్లు సమాచారం. అయితే ఒత్తిళ్ల కారణంగా ఆ నివేదిక బుట్టదాఖలు అయిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ ఒత్తిళ్లపై కూడా కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలు ఇప్పుడు దృష్టి సారించినట్లుగా సమాచారం.