హేట్ స్పీచ్: పథకం ప్రకారమే అక్బర్ ప్రసంగం!
అదే సమయంలో అక్బరుద్దీన్ పైన దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీనిపై అక్బర్ తనపై నిజామాబాద్, నిర్మల్ పోలీసు స్టేషన్లలో మినహా దేశవ్యాప్తంగా కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పథకం ప్రకారం అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగాలు చేశారని అదనపు డిజిపి వినయ్ కుమార్ సింగ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. గత డిసెంబర్ 8, 23 తేదీల్లో నిజామాబాద్, నిర్మల్లో మజ్లిస్ పార్టీ సమావేశాల్లో అక్బర్ చేసిన ప్రసంగాలు రెండు వర్గాల మధ్య విభేదాల సృష్టికేనన్నారు. నేర పూరిత కుట్రలో భాగంగానే ఆ ప్రసంగాలు చేశారని ఆరోపించారు.
ప్రసంగాల పూర్తి పాఠాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టు పరిశీలనకు ఇచ్చారు. అక్బర్ ప్రసంగాల సిడిలపై చండీగఢ్ ఫోరెన్సిక్ లేబోరేటరీ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాలన్నారు. ఇటీవల అక్బర్ వాయిస్ రికార్డ్ నమూనాను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.