సినిమా ఫక్కీలో 'సూపర్' దొంగతనం సినిమ లోగుట్టు సినిమా ఫక్కీలో'సూపర్' దొంగతనంసినిమాల వల్లమంచిప్రభావం
చంద్రబాబునాయుడి మీద వరుణదేవుడు ఇప్పుడుకూడా కరుణ చూపలేదు.తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడువరుసగా మూడేళ్ళు అనావృష్టిఏర్పడింది. దానితో గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధదెబ్బతిని గత ఎన్నికల్లో టిడిపి విజయావకాశాలను దెబ్బతీసింది.చంద్రబాబు నాయుడు వరల్డ్ అంతటికీసుపరిచితుడైనా వరుణదేవుడికికరుణ కలగలేదు. ఇప్పుడు అదేవరుణుడు అధిక వర్షాలు కురిపించితెలుగుదేశం సభలకు అడ్డంకులుకల్పిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వఅక్రమాలపై జిల్లాల్లో పెద్ద ఎత్తునకార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది. చంద్రబాబునాయుడు మూడు జిల్లాల్లోపర్యటించి, నాయకులకు సూచనలు ఇచ్చి వచ్చారు. వర్షం కారణంగాఏమీ చేయలేకపోతున్నామనితెలుగుదేశం కేంద్ర కార్యాలయానికిమెసేజ్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వరుణుడికి ప్రత్యేక పూజలుచేయడం మంచిదేమో.
సిబిఐనివణికిస్తున్న మొద్దు సీను
పరిటాలరవినిఅతి సమీపం నుంచి కాల్చి చంపింది తానేననిఒక ప్రైవేటు టీవీ ఛానల్కు ఇంటర్వ్యూఇచ్చిన మొద్దు సీను అలియాస్ జూలకంటి శ్రీనివాసరెడ్డిఆచూకీ లభించక సిబిఐఅధికారులు అల్లాడుతున్నారు. రవిహత్య జరిగి ఆరు నెలలుఅయిపోయినందున ఈలోపు మొద్దు సీనుమొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునిఉంటాడని పోలీసుల అనుమానం. అందుకేఅతను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఎలా ఉంటాడన్నఊహాచిత్రాలు గీసుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు.ఆగస్టు నాలుగులోపు మొద్దు సీనునుకోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తిడెడ్లైన్ పెట్టారు. దీనితో సిబిఐఅధికారుల్లో కలవరం మొదలైంది. మొత్తానికిమొద్దు సీను ఘనతవహించిన సిబిఐ అధికారులకే చమటలుపట్టిస్తున్నాడు. మొద్దు మనిషిరాజుకంటే బలవంతుడన్న సామెతగుర్తుకొస్తోంది.
హైదరాబాద్కుభూకంపం ప్రమాదం లేదు
హైదరాబాద్నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోకొన్నేళ్ళ క్రితం భూమికంపించడంతో నగరానికిఎప్పటికైనా భూకంపం ప్రమాదముందని అప్పట్లో చిన్నా చితకాశాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే భూకంపాలపై అపోహలతో భయపడాల్సినఅవసరం లేదని ఎన్జిఆర్ఐకి చెందిన భూగర్భ శాస్త్రవేత్తభరోసా ఇచ్చారు.హైదరాబాద్ భూకంప లెక్కల్లో రెండోజోన్లో ఉందని, అది సురక్షితమైనదనిఆయన అన్నారు. కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం ప్రాంతంమూడో జోన్లోఉందని, ఆ ప్రాంతాలకు భూకంపం ప్రమాదంఎక్కువని ఆయన మీడియాప్రతినిధులకు ఇష్టాగోష్టిగా చెప్పారు.