Array
కేంద్రమంత్రి,సినీరంగ ప్రముఖుడు దాసరినారాయణరావుది ఓవరాక్షన్ తత్వం.ఆయన నిన్న జై చిరంజీవ ఫంక్షన్లోచిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానించడంఅప్రస్తుత ప్రసంగానికి పరాకాష్ట. చిరంజీవికిదాసరి నారాయణ రావంటే మొదటినుంచి అంతరాంతరాల్లో చిన్నచూపే ఉంది.ఆయన నమ్మదగిన వ్యక్తి కాదనిచిరంజీవి అభిప్రాయమని చిరు సన్నిహితవర్గాలు తెలిపాయి. దాసరి రాజకీయాల్లోకిఆహ్వానించడమంటే కాంగ్రెస్లోచేరమనికోరడమేనని చిరంజీవి కాంగ్రెస్లోచేరేటంత అమాయకుడు కాదని వీరు అంటున్నారు.రాజకీయాల్లో చేరే విషయంలో చిరంజీవికి తొందరేమీలేదని, ఇంకా చాలా సమయం ఉందని వీరుచెప్పారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తేగిస్తే సొంత పార్టీతోనే ముందుకువస్తారని, లేకపోతే అసలురాజకీయాల్లోకి రారని స్పష్టంగా తెలుస్తోంది.2008 నాటికి ఒక స్పష్టత ఏర్పడవచ్చు.
చనిపోయినశ్రీలక్ష్మిని పెళ్ళాడిన పిచ్చోడు
వెయ్యివేయి విధాలని చెబుతారు. గత ఏడాదివిజయవాడలో మనోహర్ అనే సైకో చేతిలోహత్యకు గురైన ఎంసిఎ విద్యార్ధిని శ్రీలక్ష్మిని,మరణించాక పెళ్ళాడాడు ఒకయువకుడు. చనిపోయిన శ్రీలక్ష్మినిపెళ్ళాడడం ఎలా సాధ్యమని ప్రశ్నించకండి.ఆత్మబలం అంటే అదేనని అంటున్నాడు వైజాగ్కుచెందిన సదా సాయికృష్ణ. హత్య జరిగినతర్వాత పేపర్లలో శ్రీలక్ష్మి పాస్పోర్ట్సైజు ఫోటో చూసీ చూడగానే ప్రేమలోపడిపోయానని అంటున్నాడీ విచిత్ర ఉన్మాది. శ్రీలక్ష్మినిహత్యచేసిన మనోహర్ బయటికివచ్చాక అతని మీద ప్రతీకారం తీర్చుకుంటాననికూడా అంటున్నాడు. సాయికృష్ణ పుణెలోని ఫిల్మ్ఇన్స్టిట్యూట్లో కొంత కాలంచదువుకున్న తర్వాత మణిరత్నంవద్ద అసిస్టెంట్గా పనిచేశాడు. జీవితంలోరాణించలేక నిస్పృహతో అతని ఇలా తయారైఉంటాడని మానసిక నిపుణులు అంటున్నారు. తనపేరును శ్రీలక్ష్మీ సాయికృష్ణగామార్చుకున్న ఇతను ప్రతిరోజూ ఆమెఫోటోకు పూజలు చేస్తున్నాడు. బతికుండగాఒక్కసారి కూడా ఆమెను చూడని సాయికృష్ణఆమె ఆత్మ తనతో ప్రతిరోజూ మాట్లాడుతోందనిచెబుతున్నాడు.
సుహాసినిభయం, హైద్రాబాద్లో మకాం
మొగుడుకొట్టినందుకు కాదు తోటికోడలునవ్వినందుకు బాధ పడినట్టుగా ఉంది తమిళప్రజల వ్యవహారం. మహిళలకు పెళ్ళికిముందు సెక్స్ అనుభవం తప్పు కాదనిప్రకటించిన ఖుష్బూను తిట్టిపోసి, కోర్టులకెక్కించిన తమిళ జనం, సుహాసిని కూడా సెక్స్మీద అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతోఎక్కువగా మండిపడుతున్నారు. అచ్చ తమిళమహిళ, సనాతన కుటుంబానికి చెందినసుహాసిని కూడా ఈ విధంగా మాట్లాడడం తమిళమహిళలను అవమానపరచినట్టేననితమిళ మహిళా సంఘాలు భావిస్తున్నాయి.వారి ధాటికి తట్టుకోలేక ఖుష్బూ అండర్గ్రౌండ్కువెళ్ళిపోగా, సుహాసిని చ్రిల్డన్ ఫిల్మ్ ఫెస్టివల్వంకతో హైదరాబాద్కు చేరుకుంది.