గడ్డం రాఘవేంద్రకు ఇక అడ్డమేమి?
హైదరాబాద్ లోని షేక్ పేటలో అత్యంత విలువైన 2.20 ఎకరాల భూమిని రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, అవుట్ డోర్ యూనిట్లు తదితరాల నిర్మాణానికి కేటాయించారని వాటికి బదులుగా అక్కడ వాణిజ్య సముదాయాన్ని నెలకొల్పటాన్ని సవాలు చేస్తూ టీఆర్ ఎస్ నేత టి.హరీష్ రావు పిటీషన్ వేసారు. జస్టిస్ టి.మీనాకుమారి, జస్టిస్ జి.భవాని ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. దాంతో రాఘవేంద్రరావుకి, సంగీత దర్శకుడు చక్రవర్తిలకు హైకోర్టు నోటీసులు జారి చేసింది. అయితే మళ్ళీ ఆ కేసు వెనక్కి వెళ్ళే అవకాశముందంటున్నారు. ఎందుకంటే టీఆర్ ఎస్..తెలుగుదేశం మహాకూటమిలో చేరింది కాబట్టి అని వినపడుతోంది. హరీష్ రావు..కేసీఆర్ కి సన్నిహితుడు. రాఘవేంద్రుడు...తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సన్నిహితుడు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ కొత్త స్నేహం ఎఫెక్టుతో ఆ కేసుని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. అలా జరిగితే రాఘవేంద్రడుకు పూర్తి స్ధాయి ఊరట లభించినట్లే.