నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ కు ఏకుమేకైన యాష్కి

By Santaram
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
ముందు వచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు మిన్న అన్నట్టుంది పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నిజామాబాద్ కాంగ్రెసు ఎంపీ మధు యాష్కి వ్యవహారం. ఆరేళ్ళ క్రితం అమెరికా నుంచి వచ్చిన మధుయాష్కి ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ నాయకులకు తలమానికంగా మారారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెసులో ఉంటూ అధిష్టానవర్గం దృష్టిలో వీర విధేయుడిగా పేరున్న డిఎస్ ఇప్పుడు మధు అంటే భయపడాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎన్నారై అయిన మధుకు రాహుల్ గాంధీతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్నంత కాలం దొంగ కన్సల్టెన్సీలు నడిపి కోట్ల డాలర్లు సంపాదించుకుని ఇక్కడ రాజకీయనాయకుడిగా మధు అవతారమెత్తాడన్న విమర్శలు ఉన్నాయి. ఆయనపై అమెరికా కోర్టుల్లో మోసం కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశరావు ఎన్నాళ్ళ నుంచో ఘోష పెడుతున్నాడు.

ఇదంతా ఒక ఎత్తు అయితే తాను గతంలో ఓడిపోయిన నిజామాబాద్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయాలని, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాలని డిఎస్ ఆశిస్తున్నారు. అయన పోటీకి దిగితే తెరవెనుక పావులు కదిపి ఓడించాలన్నది మధు యాష్కి వ్యూహంలా కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తానే తొలి ముఖ్యమంత్రిగా ఉండాలన్న పేరాశ యాష్కికి ఉంది. రోశయ్యను దించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సిఎం కావాలన్న ఆశ డిఎస్ కు ఉంది. ఇద్దరి ఆశల్లో తేడా ఇదే. ఆరేళ్ళ నాటి ఎన్నికల్లో యాష్కి నుంచి డబ్బు గుంజుకున్న తర్వాతే ఆయన డిఎస్ టికెట్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో పలుకుబడి సంపాదించుకున్న యాష్కి డిఎస్ ను లైట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ టికెట్ డీఎస్ కు వస్తే యాష్కి ఆయనను ఓడించడానికి తెరవెనుక కృషి చేస్తాడన్నది స్పష్టం. ఈ నేపధ్యంలో హైకమాండ్ ఈ టికెట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X