వైయస్ పథాకలను ఇమేజిని అందుకోలేకపోతున్న రోశయ్య

మద్యంపై 7 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తున్నా సంతృప్తి చెందని ప్రభుత్వం, దివంగతముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తమ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలకు కత్తెర వేసేందుకు సిద్ధమవుతున్న వైనం బీసీ వర్గాలను ఆందోళన బాట పట్టిస్తోంది. 'లాభం వస్తే తప్ప ఎలాంటి పని చేయకూడదన్న" ప్రభుత్వ వ్యాపార ధోరణి అటు బీసీ నేతలకూ ఆగ్రహం కలిగిస్తోంది. బోగస్ను తొలగించడమంటే..ఆ పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేయడంగానే బీసీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications