వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపితో జగన్ సయోధ్య యత్నాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్ సయోధ్య యత్నాలు ప్రారంభించారనే ప్రచారం గుప్పుమంటోంది. రాష్ట్ర కాంగ్రెసులో జగన్ చిచ్చు పెట్టిన నేపథ్యంలో కెవిపి ఆ మధ్య కాలంలో విదేశాల్లోని తన కుమారుడి వద్దకు వెళ్లిపోయారు. అయితే, ఇటీవల ఆయన హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించుకుంటున్న విషయం జగన్ ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెవిపిని వైయస్ జగన్ కుటుంబ సమేతంగా పరామర్శించారు.

కెవిపిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆ మధ్య కాలంలో బహిరంగ లేఖ రాశారు. దానికి కెవిపి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాగానే ఇటు కాంగ్రెసు, అటు జగన్‌కు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ జగన్‌కు, కెవిపికి మధ్య సయోధ్య కుదురుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
A buz is that YSR Congress leader YS Jagan is trying to patch up with Rajyasabha member KVP Ramachandar Rao. YS Jagan visited hospital, where KVP is getting treatment in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X