కాంగ్రెస్ నెత్తిన కూర్చున్న జగన్ పార్టీ!!
కాంగ్రెసు పార్టీ కార్యాలయం క్రింద ఉంది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం ఉందట. దీంతో ఇటీవల వర్షాకాల సమావేశాలు జరిగినప్పుడు కానీ, ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్తున్న నేతలు గానీ రాష్ట్రంలో జగన్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, క్రమంగా కాంగ్రెసు పార్టీకి తగ్గుతున్న ఆదరణకు నిదర్శనంగా సిఎల్పీ క్రింద ఉండగా, వైయస్సార్సీఎల్పీ పైన ఉందని వ్యాఖ్యానిస్తున్నారట.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సిఎల్బీ వెలవెల పోయిందట. కాంగ్రెసు పార్టీ సభ్యులు పలువురు సభకు హాజరు కాకపోవడం, వచ్చినా క్యాంటీన్కు, ప్రాంగణంలోనే ఉండటంతో సిఎల్పీ కార్యాలయం బోసిపోయిందట. అదే సమయంలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వైయస్సార్సీఎల్పీ కళకళలాడుతూ కనిపించిందట. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే దగ్గర ఉంటూ కార్యాలయంలో భేటీ అయ్యారట.