తేనెటీగల దాడి: బస్సులోకి తుర్రుమన్న షర్మిల

ఓ చెట్టు పై ఉన్న తేనె తుట్టె కదలడంతో ఈగలు ఒక్కసారిగా లేచాయి. దాంతో పాదయాత్రలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను గాయపరిచాయి. షర్మిల సమీపంలోని బస్సులోకి వెళ్లి తలదాచుకున్నారు. దీంతో ఆమెకు ప్రమాదం తప్పింది. జూలూరుపాడు బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ప్రజాసంక్షేమం పట్టని ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుతున్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు దాపురించాయన్నారు. ఎన్టీఆర్ రెక్కల కష్టంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో కిరణ్కుమార్రెడ్డి అధికారంలో చలామణి అవుతున్నారని., వీరిద్దరూ దొందు దొందేనని షర్మిల అన్నారు.
గత 137 రోజులుగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. 138వ రోజు శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ఖమ్మం జిల్లా సాయిరాం తండా నుంచి ప్రారంభించారు. రాత్రి వేపులగడ్డలో ఆమె బస చేస్తారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications