వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రదకు చిర్రెత్తింది: చెంప చెళ్లుమనిపిస్తానని..

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో: ప్రముఖ సినీ నటి, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు కోపం వచ్చింది. ఆ కోపం మామూలుగా కాదు, ఓ జర్నలిస్టును పట్టుకుని చెడామడా తిట్టేంతగా. సమాజ్‌వాదీ పార్టీలో తిరిగి చేరుతారా అని అడిగిన జర్నలిస్టుకు ఆమె నుంచి అనుకోని స్పందన ఎదురైంది.

జర్నలిస్టుపై ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చి, "ఏం ప్రశ్న అడుగుతున్నారు? బుద్ధి ఉందా, లాగిపెట్టి ఒక్కటిస్తాను జాగ్రత్త'' అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన జయప్రద గతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ.

అమర్‌సింగ్‌తో పాటు ఆమెనూ సమాజ్‌వాదీ నుంచి గతంలోనే బహిష్కరించారు. అలాంటి పార్టీ గురించి అడగడమే ఆమె ఆగ్రహానికి కారణమైంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నన్ను నెట్టేశారు, ఆ మాత్రం తెలియదా అని ఆమె జర్నలిస్టుపై రుసరుసలాడింది. హత్యకు గురైన డిఎస్పీ భార్యను పరామర్శించడానికి జయప్రద వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది.

హత్యకు గురైన డిఎస్పీ జియా ఉల్ హక్ భార్య ప్రవీణ్ ఆజాద్‌ను ఆమె పరామర్శించారు. హక్ మార్చి 2వ తేదీన హత్యకు గురయ్యారు.

English summary
Actress-turned-politician Jaya Prada today lost her cool and threatened a reporter to slap him when she was asked a question regarding her relations with Samajwadi Party, with which she was associated earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X