టిపై అత్యాచారం!: జయప్రద నోట ఎన్టీఆర్ పాట

Jayaprada
2014 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ప్రముఖ సినీ నటి, ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు పాడిన ''తెలుగు జాతి మనది నిండుగు వెలుగు జాతి మనది'' పాటను ఆమె పాడి వినిపించారు.

పార్లమెంటు ఉభయ సభలను విభజన అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్.. మహిళలపై అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయో, తెలంగాణ ప్రజలపై కూడా సీమాంధ్రులు అత్యాచారాలు జరుపుతున్నారని, తమను బలవంతంగా కలిసి ఉండాలని కోరుతున్నారని జయప్రదనుద్దేశించి అన్నారు.

అందుకు జయప్రద ఆయనకు సమాధానం ఇచ్చారు. తెలుగువారంతా కలిసిమెలిసి సోదరుల్లా ఉండాలనడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే తెలుగు జాతి మనది... అంటూ ఎన్టీఆర్ పాడిన పాటను ఆమె పాడి వినిపించారు. అందరం కలిసి ఉందామని అభిప్రాయపడ్డారు.

కాగా, వారం రోజుల క్రితమే విభజనపై జయప్రద ఆంటోని కమిటీ ముందు పెదవి విప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత వారం ఆంటోని కమిటీని కలిసిన ఆమె విభజనపై తన అభిప్రాయాన్ని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజన అనివార్యమైతే మాత్రం హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉంచాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+