నిర్మలా సీతారామన్ చీరలతో లగేజీ పోయింది
సిడ్నీ: కెయిర్న్స్ వెళ్లడానికి శుక్రావరం ఉదయమే సిడ్నీ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాను ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో లగేజీ పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మరో గంట తర్వాత కెయిర్న్స్ విమానంలో ప్రయాణిస్తూ మరో ట్వీట్ చేశారు.
తన చీరెలన్ీ పోయిన బ్యాగులోనే ఉండిపోయాయని, కెయిర్న్స్లో చీరెలు దొరుకుతాయో లేదో తెలియదని ఆమె రాశారు. శనివారం జరిగే జీ-20 సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్కు వెళ్తున్నారు ఈ విషయంపై ఎయిరిండియా స్పందించింది.
నిర్మలా సీతారామన్ బ్యాగేజీ దొరికిందని, నేరుగా కెయిర్న్స్ పంపే ఏర్పాటు చేశామని ఎయిరిండియా తెలిపింది. అది ఆణెకు సమయానికి అందితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అత్యవసరంగా చీరెలు కోసం షాపింగ్ చేసే పని తప్పుతుంది.
సిడ్నీలో దిగి కనెక్షన్ ఫ్లయిట్ పట్టుకునే సమయంలో చూసుకున్నప్పుడు నిర్మలా సీతారామన్ లగేజీ కనిపించుకండా పోయింది. ఆమె ఢిల్లీ - మెల్బోర్న్, సిడ్నీ విమానంలో గురువారం సాయంత్రం బయలుదేరారు. నిర్మలా సీతారామన్ లగేజీని సిడ్నీాలో దించడానికి బదులు మెల్బోర్న్లోనే దించారు. దీంతో ఆమె లగేజీ సిడ్నీలో కనిపించలేదు.