వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొందరు ముస్లీం నేతలపై విహెచ్‌పి నేత సంచలనవ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రాజకీయ పార్టీలలోని పలువురు ముస్లీం నేతలను ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ నాయకుడు సురేంద్ర కుమార్ జైన్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని బెదిరించేందుకు వారు ఉగ్రవాదులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వారికి భారత దేశంలో ఉండే హక్కు లేదన్నారు. జిహాదీ ఆలోచన తీరు ఉన్న రాజకీయ నేతలు, చర్చిలు... మతం పేరుతో దేశానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కొన్నిసార్లు అబు అజ్మీ, మరికొన్నిసార్లు అజాం ఖాన్ మతం పేరుతో ఉగ్రవాదులకు మార్దదర్శకులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Muslim leaders acting like mentors of terrorists: VHP

హిందూమతాన్ని వ్యతిరేకించే క్రమంలో వీరు రాజ్యాంగాన్ని, దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ముస్లీం వ్యక్తి కావడం వల్లే మరణ శిక్షను ఎదుర్కొంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.

బజరంగ్ దళ్ జాతీయ సదస్సు కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మాట్లాడుతూ... యాకుబ్ మెమన్ ఉరిశిక్షను ఆమోదించని వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

English summary
VHP on Saturday accused Muslim leaders of political parties of "acting like mentors of terrorists" to threaten India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X