వెనక్కెళ్లండి!: సీఎం ఎదుటే మహిళా జర్నలిస్ట్కి చేదు
ముంబై: ముఖ్యమంత్రి ఎదుటే ఓ మహిళా పాత్రికేయురాలికి చేదు అనుభవం ఎదురయింది. సదరు టెలివిజన్ పాత్రికేయురాలికి మొదటి మూడు వరుసల్లో సీటు ఇచ్చేందుకు నిరాకరించడం బాధాకరం. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సన్మాన కార్యక్రమంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
స్వామినారాయణ్ ఆలయంలో గోవధను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రిని సన్మానించాలని శ్రీ శాంతాక్రజ్ జైన్ తపగచ్చ సంఘం భావించింది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మహిళా పాత్రికేయులనూ ఆహ్వానించారు.

అయితే ముందు వరుసలో కూర్చొనేందుకు మరాఠీ టీవీ చానెల్ రిపోర్టర్ రేష్మి పురాణిక్ వచ్చారు. నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. మొదటి మూడు వరుసలు పురుషులకు కేటాయించామని, నాలుగో వరుసకు వెళ్లాలంటూ సూచించారు.
ఇది మహిళలను కించపరచడమేనంటూ అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆర్గనైజర్ల తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు.
దీనిపై రష్మీ పూర్ణిక్ స్పందిస్తూ.. తాను మూడో వరుసలో కూర్చున్నానని, ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు, వాలంటీర్లు వచ్చారని, తనను కూర్చునేందుకు అంగీకరించారని చెప్పారు. జైన్ సంప్రదాయం ప్రకారం అలా కూర్చోవడం వద్దనే అలా చేసినట్లుగా తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications