షాక్: బోగస్ ఓట్లు వేసేందుకు నకిలీ వేళ్లనే తయారు చేశారు!
మహారాష్ట్రలో పది మున్సిపల్ కార్పొరేషన్లు, పలు జిల్లా పరిషత్లకు మంగళవారం ఉదయం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేసేందుకు అచ్చం చేతివేలును పోలిన తీరునే నకిలీ వేళ్ల క్యాప్స్ తయారు .
ముంబై: బోగస్ ఓట్లు వేసేందుకు అక్రమార్కులు ఓ కొత్త దారిని కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో పది మున్సిపల్ కార్పొరేషన్లు, పలు జిల్లా పరిషత్లకు మంగళవారం ఉదయం పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేసేందుకు అచ్చం చేతివేలును పోలిన తీరునే నకిలీ వేళ్ల క్యాప్స్ తయారు చేసి నాసిక్లో రహస్యంగా విక్రయిస్తున్నారు. కాగా, ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కంగుతిన్నారు.

సిరాగుర్తు బోగస్ ఓటింగ్ను నివారించేందుకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బోగస్దారులు మాత్రం నివ్వరబోయే ప్రత్యామ్నాయ మార్గాన్నే ఆలోచించారు. ప్లాస్టిక్ వేలు తయారుచేయడంతో ఒకే వ్యక్తి రెండు మూడు ఓట్లు వేసే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నకిలీ వేళ్లను తయారు చేస్తున్న ముఠా కోసం నాసిక్ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications