పది నిమిషాల్లో తయారయ్యే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి.. ఇలా చేస్తే అన్నం మెతుకు మిగలదు!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తినాల్సిన అవసరం ఉంది అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అటువంటి ఆహారంలో మన అన్ని రకాల కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవడం మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. కొంతమందికి కొన్నిరకాల కూరగాయలు ఇష్టం ఉండవు. అయినా వాటివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి అనుకుంటే మనం కూర రూపంలో కాకుండా పచ్చడి రూపంలో కూడా చేసుకోవచ్చు.
మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి
ప్రతి కూరగాయలోనూ మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటాం. ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకాన్ని వండుకొని తింటూ ఉంటాం. అన్నిరకాల కూరగాయలను కలిపి మిక్స్ చేసి కూరలు వండుకున్నా, పచ్చళ్ళు చేసుకున్నా దాని ప్రయోజనాలు మన శరీరానికి బాగా ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా పది నిమిషాల్లో తయారయ్యే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఏవిధంగా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు
టమాటాలు- 2
బీరకాయ- ఒకటి
వంకాయలు- నాలుగు
క్యారెట్- ఒకటి
దొండకాయలు- నాలుగు
పచ్చిమిరపకాయలు- 15 (కారాన్ని బట్టి)
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- రెండు రెమ్మలు
ఉప్పు- రెండు స్పూన్లు
జీలకర్ర- రెండు స్పూన్లు
వెల్లుల్లిపాయలు- 8 రెబ్బలు
నూనె రెండు స్పూన్లు
తయారీ విధానం
ముందుగా మనం పచ్చడి చేయాలనుకుంటున్న కూరగాయలు అన్నింటిని ముక్కలుగా కట్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి కూరగాయల ముక్కలు, పచ్చిమిరపకాయలు అందులో వేసి మగ్గనివ్వాలి. అందులోనే చింతపండు కూడా వేయాలి. కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా చేస్తే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ
ఆపై రోట్లో కానీ, మిక్సీలో కానీ, ఈ వేయించుకున్న మొత్తం మిశ్రమాన్ని, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తో కలిపి బాగా మెత్తగా పేస్ట్ లా కాకుండా రుబ్బుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ అయినట్టే. చాలా తక్కువ సమయం లో తయారు చేసుకోగలిగిన ఈ పచ్చడి మనం దేనితో తిన్నా సరే రుచిగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications