కనుమనాడు కాకి కూడా కదలదు; ప్రయాణాలు నిషిద్ధం.. ఎందుకంటే!!
సంక్రాంతి పండుగను మూడు రోజులు పాటు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ మూడింటికి దేనికదే ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు కనుమ పండుగ. ఇంట్లోని పాడి పశువులను పూజించుకుని,పెద్దలను తలచుకునే పండుగ. ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి? అసలు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి? చేయాల్సిన పూజలు ఏమిటి? కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు అని అంటారు.. అది ఎందుకు? వంటి అనేక వివరాలను తెలుసుకుందాం.

కనుమ పండుగ విశిష్టత ఇదే
మూడు రోజులపాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవరోజు కనుమ పండుగగా జరుపుకుంటాము. దీనిని పశువుల పండుగగా కూడా చెప్పుకుంటాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వ్యవసాయానికి సంబంధించి, రైతులు ఇళ్లకు కొత్త పంట చేరిన వేళ జరుపుకునే పండుగ కాబట్టి ముఖ్యంగా పాడిపంటలకు ఈ పండుగకు ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదంతా కష్టపడుతూ పంట పండించే రైతులకు, వ్యవసాయంలో తమ వంతు సాయం అందించే పశువులకు, అలాగే పితృదేవతలకు ఈరోజును అంకితం చేస్తారు.

కనుమ నాడు అమ్మవారిని పూజించి గారెల నైవేద్యం
ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మొదటి రోజును సంక్రాంతి పండుగగా, రెండవ రోజున కనుమ పండుగగా జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇక కనుమ పండుగ తరువాతి రోజున ముక్కనుమ గా కూడా జరుపుకుంటారు. శాస్త్ర ప్రకారం ఈరోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజించడం చేస్తారు. కనుమ రోజు అమ్మవారిని పూజించి, అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెడతారు.

కనుమ పండుగనాడు ప్రయాణాలు నిషిద్ధం .. ఎందుకంటే
అలాగే పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి, ఆరోజు కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మ శాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే, వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికీ ఓ సామెత చెబుతూ ఉంటారు. అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు.

కనుమ నాడు చెయ్యాల్సింది ఇదే
కనుమ నాడు పితృ దేవతలకు ప్రసాదాన్ని పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి భుజించి, అందరూ కలిసి ఒకే చోట ఉండి పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా కనుమనాడు గారెలు, మాంసంతో పెద్దలకు నైవేద్యం పెడతారు. అలాగే ప్రయాణాలు, శుభకార్యాలు చేయడం కనుమనాడు నిషేధం. ఆరోజు ఆయా కుటుంబాలలో గతించిన పెద్దలకు కేటాయించి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాంటివి మరిచిపోయి సరదాగా తిరగడం, షికార్లు చేయడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు. అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications