ప్రధాన సేవకుడు చిరుయే: అరవింద్
రాష్ట్రంలో తమకు తెలుగుదేశంతోనే ప్రధాన పోటీ నడిచిందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హడావిడి ఎక్కువగా కనిపించినా, తెలుగుదేశం పార్టీయే అసలైన పోటీనిచ్చిందని పేర్కొన్నారు. పాలకొల్లులోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే చిరంజీవికి పోటీ ఇచ్చారని అన్నారు. తిరుపతిలో చిరంజీవిని అడ్డుకోనేందుకు కాంగ్రెస్, తెదేపా కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.
వైఎస్ పదవీ విరమణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రజారాజ్యం నేత పి.ఉపేంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యంతరకర, ఆశ్చర్యకర పథకాలను ప్రచారంలో పెట్టినా ఫలితం రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ముఠాసంస్కృతి కొనసాగకుండా ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసిందని ప్రజారాజ్యం మరో నేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రరాపాపై విషప్రచారం జరిగినా, చాలామంది అభ్యర్థులు డబ్బుల్లేక ఇబ్బందిపడినా అద్భుత విజయం సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.