ఉద్యోగులందరికీ ఇళ్ళ స్ధలాలు
ఉద్యోగుల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ..ఇప్పటికే 22% మధ్యంతర భృతిని ఇచ్చామని, ఆరో వేతన సంఘం సిఫారసులు కూడా అమలు చేస్తామని వెల్లడించారు. నగరంలో తమకు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్ ఎం.హనుమంతరెడ్డి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడుతూ..సచివాలయానికి కాగితం వెళితే సమాధానం ఉండదనే ఆరోపణలు రాకుండా, తాత్సారాన్ని వీడిపని చేయాలని ఉద్యోగులకు సూచించారు. సచివాలయ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్ హన్మంతరెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలోని 16 ఉద్యోగ సంఘాల తరఫున ఆయా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.