వైయస్ చాపర్ క్రాష్: కుట్ర లేదు

ఆ పరిస్థితిలో హెలికాప్టర్ బలమైన గాలుల వల్ల ఏటవాలుగా కిందికి వచ్చిందని, దీని వల్ల హెలికాప్టర్ చెట్లకు ఢీకొని కూలిందని నిపుణులు అభిప్రాయపడినట్లు ఒక తెలుగు టీవీ చానెల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. హెలికాప్టర్ పావురాల గుట్టను ఢీకొనలేదని కూడా నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపింది. హెలికాప్టర్ శకలాలు కిలోమీటరు పరిధిలోనే పడి ఉండడాన్ని వారు అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కాగా, పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ కార్యాలయం అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. బుధవారం డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ఎవరి అలసత్వం గానీ నిర్లక్ష్యం గానీ లేదని రమాకాంత్ రెడ్డి చెప్పారు. వారిద్దరు సంఘటనా స్థలాన్ని సందర్శించడం పట్ల డిజిసిఎ అసహనం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications