హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాంత్ మృతదేహంతో భారీ ఊరేగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించిన విద్యార్థి శ్రీకాంత్ మృతదేహంతో హైదరాబాదులో శుక్రవారం భారీ ఊరేగింపు జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి గన్ పార్కు వరకు ఊరేగింపు సాగింది. శ్రీకాంత్ అమర్ రహే అంటూ నినాదాలు మారుమ్రోగాయి. అనంతరం గన్ పార్కు వద్ద సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి జయశంకర్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ తదితరులు మాట్లాడారు. శ్రీకాంత్ త్యాగం వృధా కాదని, తెలంగాణ సాధనకు శ్రీకాంత్ త్యాగం అందించిన స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు చెప్పారు. విద్యార్థులు ప్రాణత్యాగాలకు పాల్పడవడవద్దని వక్తలు కోరారు.

అంతకు ముందు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాంత్ మృతదేహంతో ఉస్మానియా ఆస్పత్రి వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఈటెల రాజేందర్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతవరకు శ్రీకాంత్ మృతదేహానికి పోస్టు మార్టం చేయనివ్వబోమని హెచ్చరించారు. శ్రీకాంత్ కుటుంబానికి తెరాస శాసనసభ్యులు తమ నెల జీతాలను విరాళంగా ప్రకటించారు. ఎట్టకేలకు శ్రీకాంత్ మృతదేహానికి పోస్టు మార్టం జరిగింది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖఱ రావు అరెస్టుకు నిరసనగా ఆదివారంనాడు శ్రీకాంత్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు. అతన్ని అపోలో ఆస్పత్రి లో చేర్చారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతూ అతను శుక్రవారం ఉదయం మరణించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X