కూలిన చారిత్రక ప్రసిద్ధ శ్రీకాళహస్తి రాజగోపురం

పదేళ్ల కిందటే ప్రమాద సంకేతాలు చిన్నచిన్న పగుళ్ల రూపంలో బయట పడ్డాయి. రెండు దశాబ్దాల కిందట గోపురానికి సమీపంలోనే శంకరముని కాంప్లెక్సును నిర్మించారు. అప్పట్లో పునాదులు తీసే సమయంలో గోపుర పునాదులు కదిలిపోయాయి. దీంతోపాటు 1984-86 మధ్య గోపురానికి సిమెంటు పూత వేయించే సమయంలో విచక్షణరహితంగా గుంతలు చేశారు. మెట్లు ఉన్నా కూడా సిమెంటు కాంక్రీటును పైకి తీసుకెళ్లేందుకు చేసిన గుంతలు గోపురం ఉత్తరం భాగాన్ని చాలా వరకు దెబ్బతీశాయి. ఆ తర్వాత కాలంలో పగుళ్లు మరింత పెద్దవి అవుతూ వచ్చాయి. ఆలయ అధికారులు వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇటీవలి తుపానుకు ముందు పట్టణంలో గోపురానికి అత్యంత సమీపంలో పిడుగు పడింది. భారీ వర్షాల కారణంగా పగుళ్లు ఇంకా పెరిగిపోయాయి. గోపురాన్ని పరిరక్షించుకోవడానికి చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణుల సహకారం తీసుకున్నారు. సోమవారం ఆ బృందం వచ్చి పరిశీలించింది. ప్రస్తుతానికి ప్రమాదం లేకున్నా ఎప్పటికైనా తప్పదని నిపుణులు హెచ్చరించారు. ఉత్తరం వైపు గోపురాన్ని మాత్రం నిలపడం కష్టమని పేర్కొన్నారు. గోపురం చుట్టూ 150 అడుగుల పరిధిని ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించి అక్కడున్న దుకాణాలన్నింటినీ ఖాళీ చేయించాలని సూచించింది. ఆలయ వర్గాలు ఆ దుకాణాలను వెంటనే ఖాళీ చేయించాయి. ప్రమాదజోన్గా గుర్తించిన పరిధి చుట్టూ కంచె వేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications