విద్యార్థినిపై నాలుగు నెలలుగా అత్యాచారం జరిపిన కీచకుడు
అయూబ్ పాఠశాలలోని అమ్మాయిల వసతిగృహంపై పెంట్ హౌస్ లో ఉండేవాడు. వీలున్నప్పుడల్లా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడేవాడు. తన కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయం చూసి హైదరాబాద్ కు తీసుకువచ్చి నాలుగైదుసార్లు బలవంతంగా రేప్ చేశాడు. తన శరీరంలో మార్పులు రావడంతో కంగారు పడిన ఆ అమ్మాయి ఎదురుతిరగడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి 'మీ అమ్మాయి ప్రేమలో పడింది, వచ్చి గట్టిగా బుద్ధి చెప్పండి' అని చెప్పాడు. వారు ముంబయి నుంచి వచ్చి తమ కుమార్తెను ప్రశ్నించగా, అయూబ్ అత్యాచారం చేశాడని చెప్పింది. 11వ తరగతి చదువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులను అయూబ్ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్నాయి. అయూబ్ ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులతో వచ్చి ఫిర్యాదు చేసిందని చెప్పారు. అయూబ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి తుపాకీ, పిస్టల్, రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయూబ్ 'వ్యవహారం'పై విచారణకు ఆదేశించినట్లు మంత్రి మాణిక్యవరప్రసాదరావు వెల్లడించారు.
అయూబ్ ఖాన్ హైదరాబాద్ నివాసి. చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. విదేశాల్లో కొన్నాళ్లు ఉన్నత చదువులు చదివాడు. ఎనిమిదేళ్ల కిందట అంతర్జాతీయ ప్రమాణాలతో వికారాబాద్ సమీపంలోని మన్నెగూడ వద్ద పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించాడు. పాఠశాల నిర్వహణ అంతా అయూబ్ ఖాన్ కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో ఉంది. ప్రిన్సిపాల్ గా అయూబ్ ఖాన్ సోదరి అయేషా తన్వీర్ కొనసాగుతోంది.